జోగిపేట : జల్సాలకు అలవాటుపడి జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలను తస్కరించి దొంగతనాలకు పాల్పడే జోగిపేట కు చెందిన దిలీప్ ను జోగిపేట యస్.ఐ వాహనాలను తనికి చ్చేస్తుండగా అనుమానస్పదంగా బైక్ పై తిరుగుతుండగా పాత నేరస్తుడైన దిలీప్ ను అదుపులోకి తీసుకొని విచారించగా దిలీప్ బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు అంగీకరించినట్లు జోగిపేట సి.ఐ సైద నాయక్ మరియు ఎస్.ఐ అనిల్ కుమార్ మీడియా కు తెలియజేశారు గతం లో ఇతనిపైన జిల్లా లోని పలు స్టేషన్ లలో బైక్ దొంగతనా లతో పాటు నగల చోరి కేసులు ఉన్నట్లు తెలిపారు నిందితుడు దిలీప్ నుంచి ఆరు ద్విచక్ర వాహనాలను రికవరీ చేసి కోర్ట్ కు రిమాండ్ చేశారు సరైన ధృవపత్రాల ఆధారాలతో స్టేషన్ కు వస్తే వారి బైక్ లను వారికి అప్పగిస్తామని ఎస్.ఐ తెలిపారు ఈ బైక్ దొంగతనాల రికవరికి చాకచక్యంగా వ్యవహరించిన మహేందర్, శివకుమార్,కిశ్తఫర్, సిబ్బందిని అభినందిస్తూ అవార్డు నిమిత్తం పైఅధికారులకు తెలియజేస్తామన్నారు