![]() |
అన్నాసాగర్ కట్టపైన రెండు కార్లు డీకొన్న దృశ్యం |
www.jogipet.com :-రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన జోగిపేట మండల పరిధిలోని అన్నాసాగర్ చెరువుకట్టపై శనివారం ఉదయం చోటుచేసుకుంది. పెద్దశంకరంపేట నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారును ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కారుల్లో ప్రయాణిస్తున్న శ్రీకాంత్, రాజేష్, స్వాతి, అంకిత, అర్జున్రావు, శోభారాణి, పవన్లు స్వల్పంగా గాయపడ్డారు. వీరిని 108 జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ మల్లేశం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.