టేక్మాల్ లోని కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు అస్వస్థత
టేక్మాల్ మండలం కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో పది మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరం, వాంతులు, తలనొప్పితో బాధపడుతున్న బాలికలను పాఠశాల సిబ్బంది టేక్మాల్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిం చారు. అనంతరం జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.పాఠశాల పరిసరాల్లో అపరిశుభ్రత నెలకొంది. పాఠశాల పక్కనుంచే మురుగునీరు ప్రవహిస్తోంది. దీంతో ఈగలు దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. వాతావరణ కాలుష్యం కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది.