బ్రేకింగ్ న్యూస్: అల్లాదుర్గ్ ::అల్లాదుర్గం మండలం మర్వెల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి ఓ పూరిగుడిసె దగ్ధమైంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు . జోగిపేట :: మీకు ఏదైనా సమాచారం తెలిస్తే ఈ నెంబర్ కి ఫోన్ చేయండి 9000224866.

26, ఫిబ్రవరి 2013, మంగళవారం

ప్రధాన దేవాలయాలు

చారిత్రక ప్రాధాన్యతను కలిగి కళాత్మక నైపుణ్యంతో నిర్మితమైన రాష్ట్ర ,జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ప్రముఖ దేవాలయాలు మెదక్ జిల్లా లో ఉన్నాయి.

 కేథడ్రల్ చర్చి - మెదక్




ప్రపంచ ప్రసిద్ది గాంచిన సుందరమైన కేథడ్రల్ చర్చి మెదక్ పట్టణం లో ఉంది ఇది ఆసియా ఖండం లోనే రెండవ అతి పెద్ద చర్చిగా పేరుగాంచింది ఈ చర్చి జిల్లాకే తలమనికగా బాసిల్లుతుంది . పనికి ఆహరం ప్రాతిపదికన చేపట్టిన ఈ చర్చి నిర్మాణం 1914 లో ప్రారంబమై 1924 వరకు పదేళ్ళపాటు కొనసాగటం విశేషం ఈ అందాల మందిరాన్ని చూసేందుకు రాష్ట్ర  నలుమూలలనుండే కాకుండా దేశ విదేశాల నుండి కూడా సందర్శకులు అక్కడకు వస్తారు

 వనదుర్గా మాత - ఏడుపాయల




రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉత్సవాలు జరిగే సుప్రసిద్ద పుణ్యక్షేత్రం '' ఏడుపాయల వనదుర్గా మాత '' ఆలయం మంజీరా నది ఎడుపాయలుగా చీరి ప్రవహించే చోట ఓ పాయ ఒడ్డున రాతిగుహలలో వనదుర్గామాత కొలువైనది. చుట్టురానది, పాయలు, కొండలు రాళ్లగుట్టలు, చెట్లపోదలతో నిండి ఉండే ఏడుపాయల ప్రాంగణం ఏడాది పొడవున నిత్యం దీప దూప నైవేద్యాలతో అలరాలుతుంది . జమదగ్ని అత్రి,కాశ్యపి,విశ్వామిత్ర,వశిష్ట,భరద్వాజ,గౌతమి అనే సప్త ఋషుల పేర్లతో మహాశివరాత్రి జాతరకు రాష్ట్రం నుండే కాకా పక్క  రాష్ట్రాలనుండి కూడా భక్తులు వస్తారు మహాశివరాత్రి నాడు 10 లక్షలకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించు కుంటారు.

 విధ్యాధరి క్షేత్రం - వర్గల్ 


చదువులతల్లి సరస్వతి కొలువైన విధ్యాధరి క్షేత్రం హైదరాబాద్ కి ఆనుకొనిఉన్న వర్గల్ మండల కేంద్రమ్ లో ఉంది  చదువులతల్లి కొలువై ఉన్న ఈ ఆలయం జిల్లాలోనే ప్రసిద్ద పుణ్య క్షేత్రం ఎతైన కొండలపై వెలసిన ఈ ఆలయం ప్రముక పుణ్య క్షత్రంగా  వెలుగుతుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు జంట నగరవాసులు ఎక్కువగా వస్తుంటారు.

ఖేతకీ సంగమేశ్వర ఆలయం - ఝరాసంఘం




పురాతనమైన ఖేతకీ సంగమేశ్వర ఆలయం ఎంతో ప్రసిద్ది గాంచింది ఈ మందిరం ఝరాసంఘం మండలకేంద్రంలో కలదు ఇది దక్షిణ కాశిగా ఖ్యాతికేక్కింది కాశి నుంచి ఒక ఝరా ( జాలం ) ఇక్కడ ఆలయంలోని అమృత గుండంలో కలుస్తుందని ప్రతీతి అందువల్ల ఈ గుండంలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని భక్తులనమ్మకం ఏట మహాశివరాత్రి సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తారు