మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం మర్వెల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి ఓ పూరిగుడిసె దగ్ధమైంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మర్వెల్లి గ్రామానికి పెంటయ్య కుటుంబం కూలీ పనులు చేసుకోవడానికి బతుకుదెరువు కోసం వచ్చారు. గురువారం అర్ధరాత్రి వారు నివసిస్తున్న గుడిసెకు ఒక్కసారిగా నిప్పంటుకొని దహనమైంది. దీంతో అందులో నిద్రిస్తున్న పెంటయ్య భార్య లక్ష్మి (35), కూతురు పోచమ్మ (3), కొడుకు మొగులయ్య (1), అత్త చంద్రమ్మ (45) సజీవ దహనమయ్యారు.