బ్రేకింగ్ న్యూస్: అల్లాదుర్గ్ ::అల్లాదుర్గం మండలం మర్వెల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి ఓ పూరిగుడిసె దగ్ధమైంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు . జోగిపేట :: మీకు ఏదైనా సమాచారం తెలిస్తే ఈ నెంబర్ కి ఫోన్ చేయండి 9000224866.

28, ఫిబ్రవరి 2013, గురువారం

మర్మాంగ అవయవాలు కోసుకొని .... చేతిలో పట్టుకొని ....

www.jogipet.com :- జోగిపేట 


జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యాదయ్య 
సాధారణంగా ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు ?     ప్రేమవిఫలమై,కుటుంబ కలహాలతో లేక అప్పులబాధ తట్టుకోలేకనో ఆత్మహత్యా యత్నం చేసిన ఘటనలు మనం ఎన్నో చూసాం కానీ ........ పందుల దొంగతనం చేసాడని ఆరోపించటంతో తన మర్మంగావయవాలు కోసుకుని యాదయ్య (26) అనే వ్యక్తి ఆత్మహత్య యత్నం చేసాడు. భాధితుడు యాదయ్య జోగిపేట.కామ్ తో అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.  పందుల పెంపకం యాదయ్య కులవృత్తి. బుధవారం నాడు పందులను వేటాడాడు. తోటి పందులపెంపకం దారులు  శ్రీను, వెంకటేష్ లు వారికి సంబందించిన పందులను పట్టుకున్నట్లు ఆరోపిస్తూ  తనపై దాడికి పాల్పడినట్లు  వివరించాడు . యాదయ్య మర్మాంగ అవయవాలమీద భలంగా కొట్టడంతో ఆ నొప్పిని భరించలేక పోయాడు. ఈ భాధ బరించలేక గురువారం ఉదయం  పందులను కోసే కత్తితో తనకు తానే తన పురుసాలను కోసుకున్నట్లు చెప్పాడు. రక్తస్రావం చూసి  చలించి పోయి ఓ ప్లాస్టిక్  కవర్ లో వేసుకొని ఆసుపత్రికి వెళ్తూనే మార్గమధ్యంలో సోమ్మసిల్లాడు. అది గమనించిన కుటుంబీకులు, బంధువులు అతన్ని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అనంతరం వైద్యులు  ప్రతమికచికిత్స అందించి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. 


27, ఫిబ్రవరి 2013, బుధవారం

రాజకీయ నేపథ్యం



జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు 2 ఎంపి స్థానాలు ఉన్నాయి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న దామోదర్ రాజనరసింహ ఆందోల్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు భారిపరిశ్రమలశాఖ మంత్రి గీతా రెడ్డి, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి సునితా లక్ష్మారెడ్డి, ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి జిల్లా అసెంబ్లీ స్థానాలనుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత 2009 సార్వత్రిక ఎన్నికలలో జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు 8 కాంగ్రెస్, మెదక్ తెలుగుదేశం, సిద్దిపేట టిఅర్ఎస్ పార్టీలు కైవసం చేసుకున్నాయి. జిల్లాలో 8 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలవటం వలన  కాంగ్రెస్ పార్టీకి జిల్లా కంచు కోటగా ఉంది అని  కాంగ్రెస్ వర్గీయులు, ఉన్నత స్థాయి నాయకులు చెపుతుంటారు. పార్లమెంట్ స్థానాలలో జహీరాబాద్  పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ  కైవసం చేసుకుంది మెదక్ పార్లమెంట్ స్థానాన్ని  టిఅర్ఎస్ పార్టీ  కైవసం చేసుకుంది. జహీరాబాద్  పార్లమెంట్ స్థానాన్ని  కాంగ్రెస్ పార్టీ సురేష్ షేట్కార్ ప్రాతినిద్యం వహించగా  మెదక్ పార్లమెంట్ స్థానాన్ని  టిఅర్ఎస్ పార్టీ విజయ శాంతి  ప్రాతినిద్యం వహిస్తున్నారు. 



26, ఫిబ్రవరి 2013, మంగళవారం

ప్రధాన దేవాలయాలు

చారిత్రక ప్రాధాన్యతను కలిగి కళాత్మక నైపుణ్యంతో నిర్మితమైన రాష్ట్ర ,జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ప్రముఖ దేవాలయాలు మెదక్ జిల్లా లో ఉన్నాయి.

 కేథడ్రల్ చర్చి - మెదక్




ప్రపంచ ప్రసిద్ది గాంచిన సుందరమైన కేథడ్రల్ చర్చి మెదక్ పట్టణం లో ఉంది ఇది ఆసియా ఖండం లోనే రెండవ అతి పెద్ద చర్చిగా పేరుగాంచింది ఈ చర్చి జిల్లాకే తలమనికగా బాసిల్లుతుంది . పనికి ఆహరం ప్రాతిపదికన చేపట్టిన ఈ చర్చి నిర్మాణం 1914 లో ప్రారంబమై 1924 వరకు పదేళ్ళపాటు కొనసాగటం విశేషం ఈ అందాల మందిరాన్ని చూసేందుకు రాష్ట్ర  నలుమూలలనుండే కాకుండా దేశ విదేశాల నుండి కూడా సందర్శకులు అక్కడకు వస్తారు

 వనదుర్గా మాత - ఏడుపాయల




రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉత్సవాలు జరిగే సుప్రసిద్ద పుణ్యక్షేత్రం '' ఏడుపాయల వనదుర్గా మాత '' ఆలయం మంజీరా నది ఎడుపాయలుగా చీరి ప్రవహించే చోట ఓ పాయ ఒడ్డున రాతిగుహలలో వనదుర్గామాత కొలువైనది. చుట్టురానది, పాయలు, కొండలు రాళ్లగుట్టలు, చెట్లపోదలతో నిండి ఉండే ఏడుపాయల ప్రాంగణం ఏడాది పొడవున నిత్యం దీప దూప నైవేద్యాలతో అలరాలుతుంది . జమదగ్ని అత్రి,కాశ్యపి,విశ్వామిత్ర,వశిష్ట,భరద్వాజ,గౌతమి అనే సప్త ఋషుల పేర్లతో మహాశివరాత్రి జాతరకు రాష్ట్రం నుండే కాకా పక్క  రాష్ట్రాలనుండి కూడా భక్తులు వస్తారు మహాశివరాత్రి నాడు 10 లక్షలకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించు కుంటారు.

 విధ్యాధరి క్షేత్రం - వర్గల్ 


చదువులతల్లి సరస్వతి కొలువైన విధ్యాధరి క్షేత్రం హైదరాబాద్ కి ఆనుకొనిఉన్న వర్గల్ మండల కేంద్రమ్ లో ఉంది  చదువులతల్లి కొలువై ఉన్న ఈ ఆలయం జిల్లాలోనే ప్రసిద్ద పుణ్య క్షేత్రం ఎతైన కొండలపై వెలసిన ఈ ఆలయం ప్రముక పుణ్య క్షత్రంగా  వెలుగుతుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు జంట నగరవాసులు ఎక్కువగా వస్తుంటారు.

ఖేతకీ సంగమేశ్వర ఆలయం - ఝరాసంఘం




పురాతనమైన ఖేతకీ సంగమేశ్వర ఆలయం ఎంతో ప్రసిద్ది గాంచింది ఈ మందిరం ఝరాసంఘం మండలకేంద్రంలో కలదు ఇది దక్షిణ కాశిగా ఖ్యాతికేక్కింది కాశి నుంచి ఒక ఝరా ( జాలం ) ఇక్కడ ఆలయంలోని అమృత గుండంలో కలుస్తుందని ప్రతీతి అందువల్ల ఈ గుండంలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని భక్తులనమ్మకం ఏట మహాశివరాత్రి సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తారు


జైన మందిరం

క్రీ.శ 15 వ శతాబ్ధంలో పైక్రాంతగిరి ( జోగినాథ గుట్ట ) పై 240 మంది జైన జోగులు నివసిస్తూ ఉండేవారట వారు అక్కడే పాలరాతి జైనుని, 24 మంది జైన తీర్థంకరుల విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేస్తుండే వారు. ఇవి తెల్లని పాలరాతితో జీవముట్టి పడునట్లు గలవు  వీరిలో సంసారులు మాత్రం  జోగినాథ గుట్ట దిగువన ఓ బస్తిని దానిని ''జైన జోగుల బస్తి '' గా నామకరణం చేసి పిలిచేవారు. 
1640-50 మధ్య కాలంలో నూలు బసప్ప అనే శైవ వ్యాపారి కొందరు వీర శైవులతో కలిసి జైన జోగులను తరిమివేసి వారి ఆలయ ప్రాంగణంలో జొగినాథాలయం నిర్మించారు.  ఆ జైన తీర్థంకరుల విగ్రహాలను జోగినాథ గుట్ట నుంచి తెచ్చి ఓ ఇంట్లో ప్రతిష్టించి ఆరాదించుచున్నారు. ఇప్పటికి ఈ ఆలయం ఉంది. 

ప్రస్తుతం జైన మందిరంలో ఉన్న జైన తీర్థంకరుల విగ్రహాలు 

జోగిపేట లో ఓ మహిళ అనుమానాస్పద మృతి

www.jogipet.com :- 
 శోభ పాతచిత్రం 
  జోగిపేట లోని వ్యవసాయ మార్కెట్ ముందు నివాసం ఉంటున్న శోభ  అలియాస్ నీరజ (24) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ...

చింతకుంటలో - నలుగురి ఉపాధ్యాయుల సస్పెన్షన్

www.jogipet.com :-    ఈ ఉపాధ్యాయులు మాకొద్దు!   

 జోగిపేట, చింతకుంటల  : గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తికి కొందరు మచ్చ తెస్తున్నారు. క్రమ శిక్షణ, విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే పిల్లలతో చెప్పించుకోవాల్సిన పరిస్థితి. ఉపాధ్యాయుల తీరును నిరసిస్తూ అందోల్ మండలం చింతకుంట ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు జోగిపేట- మెదక్ రహదారిపై సోమవారం గంటపాటు ఆందోళన చేశా రు. సీఐ విద్యార్థులను సముదాయించి ఆందోళన విరమింపజేశారు. విషయం తెలుసుకుని ఎంఈఓ గోపాల్ గ్రామానికి చేరుకుని పాఠశాలలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆసక్తికర అంశాలను విద్యార్థులు ఎంఈఓ దృష్టికి తెచ్చారు. పాఠశాలలో సాంఘిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు రమేష్ జేబులోనే మద్యం సీసా పెట్టుకుని నిత్యం సేవిస్తూ ఉంటారని విద్యార్థులు ఆరోపించారు. ఇక ఉపాధ్యాయులు జ్యోత్స్న, ఇందిరల పనితీరుపైనా విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలకు సక్రమంగా రారని, వచ్చినా పాఠాలు బోధించరని పేర్కొన్నారు. విచారణలో భాగంగా ఎంఈఓ సదరు టీచర్లను పిలిచి విద్యార్థుల పేర్లను అడిగారు. పేర్లు చెప్పడంలో టీచర్లు తడబడ్డారు. ఇక ఇటీవల ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు తీసుకున్న సుభాష్‌చందర్ వారానికోమారు విధులకు హాజరవుతున్నట్లు విద్యార్థులు ముక్తకంఠంతో చెప్పారు. ఉపాధ్యాయుడు రమేష్, సుభాష్ చందర్‌లు ఒకరువస్తే మరొకరు రారని, హెచ్‌ఎం బాధ్యతలు వీరు మార్పిడి చేసుకుంటారని విచారణలో తేలింది. 

నలుగురి ఉపాధ్యాయుల సస్పెన్షన్
             చింతకుంట ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న నలుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంఈఓ గోపాల్ తెలిపారు. విద్యార్థుల ఆందోళన అనంతరం వివరాలు సేకరించిన డీఈఓ పాఠశాల హెచ్‌ఎం సుభాష్ చందర్, స్కూల్ అసిస్టెంట్ రమేష్, ఎస్‌జీటీలు జ్యోత్స్న, ఇందిరలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు.

25, ఫిబ్రవరి 2013, సోమవారం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం

స్వామి గౌడ్
కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయ దుందుబి మోగించింది. తన ఖాతాలోకి మరో రెండు ఎమ్మెల్సీ సీట్లను నమోదు చేసుకుంది. తెలంగాణ వాదం ఎంత బలంగా ఉందో మరోసారి రుజువు చేసింది. తెలంగాణ వాదం లేనేలేదంటూ కుళ్లు వ్యాఖ్యలు చేసే సీమాంధ్ర నేతల నోళ్లకు తాళాలు వేసేలా తెలంగాణ ఎమ్మెల్సీ నియోజక వర్గ ఓటర్లు తీర్పు చెప్పారు. ఈ ఎన్నికల్లో బరిలోకి దిగిన టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతీరౌండులోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థులు తమ ఆధిక్యతను కాపాడుకుంటూ వచ్చారు. గెలుపులోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థి పాతూరి సుధాకర్‌రెడ్డి రికార్డు నెలకొల్పారు. తొలి ప్రాధాన్యత ఓట్లతోనే గెలిచిన అభ్యర్థిగా ఎన్నికల చరిత్రలో ఆయన రికార్డు నెలకొల్పారు. 
మొతాం వోట్లు -58,354,    పోలైన వోట్లు _52,297,   స్వామి గౌడ్ - 48,470
 సెకండ్ప్లేస్ - చంద్రశెకర్ - 885.  చెల్లని వోట్లు - 6057.


టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పాతూరి ఘన విజయం
టీచర్స్ ఎమ్మెల్సీ నియోజక వర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీలోకి దిగిన పాతూరి సుధాకర్‌రెడ్డి ఎన్నికల చరిత్రలోనే కొత్త రికార్డు నెలకొల్పారు. తొలి ప్రాధాన్యత ఓట్లతోనే గెలిచిన అభ్యర్థిగా ఎన్నికల చరిత్రలో ఆయన రికార్డు నెలకొల్పారు. మొత్తం ఓట్లు 18,235 కాగా, ఆయన 9,324 ఓట్లు సాధించి విజయాన్ని కైవసం చేసుకున్నారు. ఆయన సమీప ప్రత్యర్థి మోహన్‌రెడ్డికి 4,301 ఓట్లు వచ్చాయి. లకా్ష్మరెడ్డి-3675, కిష్టు-388, అశోక్-153, లక్ష్మినారాయణ- 18 ఓట్లు వచ్చాయి. 376 ఓట్లు చెల్లకుండా పోయాయి. 

సింగూరు ప్రాజెక్టులో పడి ఒకరి మృతి

www.jogipet.com :-      సింగూర్: మండల పరిధిలోని సింగూర్ ప్రాజెక్టు దిగువ భాగం నీటిలో మునిగి సదాశివపేట మండలం ఆత్మకూర్ గ్రామానికి చెందిన సత్యనారాయణ (20) ఆదివారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. సత్యనారాయణ శనివారం ఉదయం ఇంటి నుంచి ముగ్గురు స్నేహితులతో కలిసి జోగిపేట లోని బంధువుల ఇళ్లకు వెళ్లారన్నారు. 

అనంతరం వారి వారి బంధువుల ఇళ్లలో రాత్రి పడుకుని ఉదయం తిరిగి స్వగ్రామానికి స్నేహితుడు సత్తయ్యతో కలిసి సత్యనారాయణ బయలుదేరాడన్నారు. అయితే మార్గమధ్యలో ఉన్న సింగూర్ ప్రాజెక్టులో స్నానం చేసేందుకు వీరిరువురూ దిగారు. ఈ క్ర మంలో సత్యనారాయణ నీట మునిగి మృతి చెందాడని స్నేహితుడు సత్తయ్య తెలిపినట్లు వారు వివరించారు. మృతుడు సదాశివపేట మండలం ఎంఆర్‌ఎఫ్ పరిశ్రమలో పని చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

23, ఫిబ్రవరి 2013, శనివారం

నగర పంచాయతీగా ‘అందోల్-జోగిపేట’


అందోల్, జోగిపేట గ్రామ పంచాయతీలను విలీనం చేసి ‘అందోల్-జోగిపేట నగర పంచాయతీ’గా ఏర్పాటు చేస్తూ శుక్రవారం పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఆధర్ సిన్హా ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా ఈ రెండు ప్రాంతాలను గ్రామ పంచాయతీలుగా పేర్కొంటూ పూర్వం జారీ చేసిన ప్రకటనను రద్దు చేస్తూ పంచాయతీ శాఖ ముఖ్యకార్యదర్శి వి.నాగిరెడ్డి మరో ఉత్తర్వులు (జీఓ ఎంఎస్ నెం.50)ను జారీ చేశారు. ఇప్పటికే సిద్దిపేట,మెదక్, సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్,గజ్వేల్గా,ఇటీవల ఏడు గ్రామలతో కలిపిదుబ్బాకను నగర పంచాయతీ’గా చేసిన ప్రభుత్వం తాజాగా జోగీపేటను నగర పంచాయతీ’గా ఏర్పాటు చేయటంతో  జిల్లాలో మొత్తం పురపాలక సంగాల సంఖ్య ఎనిమిదికి  ేరినట్లైనది. దీంతో జిల్లాలో గ్రామ పంచాయతీల సంఖ్య 1040కు తగ్గింది. 2006లో జరిగిన ఎన్నికల నాటికి జిల్లాలో 1059 గ్రామ పంచాయతీలుండగా నగర పంచాయతీల ఏర్పాటుతో క్రమంగా సంఖ్య తగ్గుతూ వస్తోంది.

21, ఫిబ్రవరి 2013, గురువారం

దిల్‌సుఖ్‌నగర్‌లో పేలుళ్లు, 16 మంది మృతి

హైదరాబాద్: నగరంలోని దిల్ సుఖ్ నగర్ వద్ద మూడు వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 16 మంది  మృతి చెందినట్టు తెలుస్తోంది. దిల్ సుఖ్ నగర్ లోని కోణార్క్,వెంకటాద్రి థియేటర్ల వద్ద పేలుళ్లు చోటు చేసుకున్నాయి. పేలుళ్ల ప్రభావం కంటే తొక్కిసలాటలోనే ఎక్కువ మంది చనిపోయినట్టు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలోనే ఈ పేలుళ్లు చోటుచేసుకోవడం గమనార్హం.ఈ దుర్ఘటనలో పలువురు గాయపడ్డారు.భయంతో జనం పరుగులు తీసినట్టు సమాచారం. ఈ దుర్ఘటన సాయంత్రం 7గంటలకు చోటుచేసుకుంది. తొలి పేలుడు జరిగిన నిమిషం వ్యవధిలోనే మరో పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. పేలుళ్లు చోటు చేసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా జంటనగరాల్లో పలు ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు ముమ్మరం చేశాయి. పేలుళ్ల సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలానికి అంబులెన్సులు చేరుకున్నాయి. క్షతగాత్రులను ఉస్మానియా, ఓమ్నీ, మలక్‌పేట యశోదా ఆస్పత్రులకు తరలించారు. ఉస్మానియా లో 40 మంది, ఓమ్ని 18 , యశోదాలో 20 మంది క్షతగాత్రులను తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ఆటో, బైక్‌ను ఢీకొన్న లారి నలుగురి మృతి

ఓ గుర్తుతెలియని లారి  ఆటో, బైక్‌ను వరుసగా ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందారు . మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో పుల్‌కల్ మండలం అకోలా-నాందేడ్ రహదారిపై న్యూ హున్నాపూర్ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
                  పుల్‌కల్ మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన అశోక్ (42), అందోల్‌కు చెందిన ఆటో డ్రైవర్ సోఫీ (40), అదే మండలం సంగుపేటకు చెందిన గొల్ల అశోక్ అలియాస్ ప్రభు (30), అందోల్‌కు చెందిన వంశీ, అంజనేయులు ఆటోలో సంగారెడ్డి వైపు నుంచి జోగి పేట వైపు వస్తుండగా ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని లారి  హున్నాపూర్ వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న అశోక్, ఆటో డ్రైవర్ సోఫీ, మరో గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. వంశీ, అంజనేయులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. ఇదిలా ఉండగా ఆటోను ఢీకొట్టిన వాహనం ఆగకుండా ముందు కు వెళ్లి అర కిలోమీటర్ దూరంలో బైక్ ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న శివ్వంపేట వాసి గంగారెడ్డి (35) అక్కడికక్కడే మృతి చెందాడు. రెండు చోట్ల ప్రమాదాలు జరిగిన విష యం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని మృతదేహా లను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్పీ విజయ రామారావు, మెదక్ డీఎస్పీ గోద్రూ, జోగిపేట సీఐ సైదానాయక్, పుల్‌కల్ ఎస్‌ఐ జానకిరాములు ప్రమాద స్థలంలో వివరాలు సేకరించా రు. ఘటన జరిగిన చోట ఏపీ 24 టీబీ 3749 నంబర్ ప్లేట్ లభించిందని పోలీ సులు తెలిపారు

19, ఫిబ్రవరి 2013, మంగళవారం

మీ సేవ’ ద్వారా ఆధార్ వివరాలు

www.jogipet.com
                               
 ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకొన్నవారు.. తమ ఆధార్ స్థితిని ‘మీ సేవ’ కేంద్రాల్లో తెలుసుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని సోమవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ‘మీ సేవ’ కేంద్రంలో ప్రారంభించారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పటికీ ఆధార్ కార్డు ఇంకా అందనివారు, ఆధార్ కార్డు పోగొట్టుకున్నవారు ఆధార్ రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన రశీదు నంబరుతో రూ. 20 రుసుం ‘మీ సేవ’లో చెల్లిస్తే ఆధార్ నంబరు పొందవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 6 వేల మీసేవ కేంద్రాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఆధార్ కార్డు లేకున్నా ఈ ఆధార్ నంబర్‌తో కూడిన స్టేటస్ రిపోర్టును రేషన్‌కార్డు, గ్యాస్ కనెక్షన్, ఇతరత్రా పథకాలకు దాఖలు చేయవచ్చు. 

16, ఫిబ్రవరి 2013, శనివారం

ఘనంగా శ్రీ వెంకటేశ్వస్వామి విగ్రహ ప్రతిషాపనా మహోత్సవం



జిల్లా కేంద్రమైన సంగారెడ్డి సమీపంలోని వైకుంఠపురంలో శ్రీ మహాలక్ష్మి గోదా సమేత వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠాపనామహోత్సవం గురువారం అత్యం త వైభవంగా జరిగింది. భక్తుల శరణుఘోషల మధ్య శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మీ గోదా సమేతంగా ఆలయంలో కొలువుదీరాడు. ఈ ప్రతిష్ఠాపనా మహోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా ప్రజలు భారీ ఎత్తున తరలిరావడంతో వైకుంఠపురం గురువారం జనసంద్రమైంది. 

12, ఫిబ్రవరి 2013, మంగళవారం

ముగ్గురు విద్యార్థుల అదృశ్యం


మెదక్  జిల్లాలోని పటాన్ చెరు మండలం ఇస్నాపూర్‌లో సెయింట్ మెరీస్ పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ, 15 మంది ప్రయాణికులకు గాయాలు

మెదక్‌ జిల్లా : సంగారెడ్డి (మం) పోతిరెడ్డిపల్లి వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీ, 15 మంది ప్రయాణికులకు గాయాలు.ఇద్దరి పరిస్థితి విషమం, రెండు ఆర్టీసీ బస్సులు పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

మెదక్ జిల్లాలో ఎండాకాలం రాకముందే త్రాగునీటి సమస్య

9, ఫిబ్రవరి 2013, శనివారం

ఏడుపాయల్లో అన్నీ సమస్యలే మాఘ స్నానాలకు ఇబ్బందులు

ఏడుపాయల దుర్గా భవాని  
www.jogipet.com :-తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన ఏడుపాయల పై అధికారులు అశ్రద్ధ చూపుతున్నారు . గణపురం ఆనకట్టలో నాలుగు అడుగుల మేర మాత్రమే నీరు ఉంది. దీంతో ఆదివారం జరిగే మాఘ స్నానాలు చేసేదెట్టానని భక్తులు వాపోతున్నారు. మాఘ స్నానాలకు మహా విఘ్నాలు ఎదురవుతున్నాయి. తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన ఏడుపాయల దుర్గా భవాని ఆలయ ఆదాయం ప్రతియేటా భారీగా పెరుగుతున్నా, వసతుల కల్పన మాత్రం అధ్వానంగా ఉంటోంది. ప్రతి సంవత్సరం మాఘ స్నానాలు, శివరాత్రి జాతర కోసం సుమారు 10 లక్షల మంది భక్తులు ఇక్కడకు వస్తుంటారు. అమ్మవారి దర్శనంతో పులకించిపోయే భక్తులకు ఇక్కడ ఏర్పాట్లు చూసి ఉసూరుమంటున్నారు.మాఘ స్నానాల కోసం సింగూరు ప్రాజెక్ట్ నుంచి నీరు విడుదల చేసే అవకాశం లేనందున ఈ సారి మడుగు నీళ్లలోనే భక్తులు పుణ్య స్నానాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఘనపురం ఆనకట్టలో ఉన్న ఒకటిన్నర అడుగుల నీరు భక్తులకు ఏ మాత్రం సరిపోతుందో తెలియని అంశం. స్నాన ఘాట్ల కోసం రూ.19.46 లక్షలు మంజూరై మూడేళ్లు కావస్తున్నా, ఇంతవరకు పనులు ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో మంజీరా నదిలో స్నానాలు చేసే భక్తులు మృత్యువాత పడుతున్నారు. అమ్మవారి దర్శనంతో పులకించిపోయే భక్తులకు ఇక్కడ ఏర్పాట్లు చూసి ఉసూరుమంటున్నారు.

మే 10న ఎంసెట్‌

సుప్రీంకోర్టు ఆదేశాలతో 'అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ)' జారీచేసిన మార్గదర్శకాలను అనుసరించి ఉపముఖ్యమంత్రి, ఉన్నతవిద్యాశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం ఏడు ప్రవేశపరీక్షల తేదీలను వెల్లడించారు. నిరుడు ఎంసెట్‌ మే 12న జరగ్గా, ఈసారి రెండు రోజులు ముందుగా మే 10న జరుగనుంది. ఐసెట్‌ అదే నెల 17న ఉంటుంది. ఇంజినీరింగ్‌, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ ఇంజినీరింగ్‌(పీజీఈసెట్‌) తరగతులు ఆగస్టు 1న ప్రారంభమవుతాయి. ఎడ్‌సెట్‌(బీఈడీ), వ్యాయామవిద్య(పీఈసెట్‌), న్యాయవిద్య(లాసెట్‌, పీజీలా) బీటెక్‌ ద్వితీయ సంవత్సరం(ఈసెట్‌) తరగతులు జులైలో వేర్వేరు తేదీల్లో మొదలవుతాయి. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ అజయ్‌జైన్‌, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి డోబ్రియల్‌, ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ జయప్రకాష్‌రావు, ఇతర అధికారులతో కలసి ఉపముఖ్యమంత్రి ఈ వివరాలను మీడియా ప్రతినిధులకు తెలిపారు. 


2013-14 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్‌ యాజమాన్య కోటా సీట్ల భర్తీని ఆన్‌లైన్‌లోనే చేపడతామని స్పష్టంచేశారు. రుసుములు, ప్రవేశాల నియంత్రణ సంఘం(ఏఎఫ్‌ఆర్‌సీ) పటిష్ఠతకు సంబంధించిన చట్టాన్ని రానున్న శాసనసభ సమావేశాల్లో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఆన్‌లైన్‌ సీట్ల భర్తీపై హైకోర్టు ఆదేశాలను అనుసరించి త్వరలోనే ఉత్తర్వులు జారీచేస్తామన్నారు. బోధనా రుసుములు చెల్లించకుంటే జనవరి 21 నుంచి ఇంజినీరింగ్‌ కళాశాలలను మూసేస్తామన్న యాజమాన్యాల ప్రకటనపై విలేఖరులు ప్రశ్నించగా- దానిపై తానేమీ మాట్లాడనని రాజనర్సింహ బదులిచ్చారు. ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రత్యేక బృందాల తనిఖీలు పూర్తికావొచ్చాయన్నారు. చివరిసారిగా ప్రాంతీయ, రాష్ట్రస్థాయి బృందాల తనిఖీలను జరపబోతున్నామని వివరించారు. తనిఖీ నివేదికలను అనుసరించి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాల ఆధారంగానే ర్యాంకుల ప్రకటన: ఈసారి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాల ఆధారంగానే ఎంసెట్‌ ర్యాంకులను ప్రకటిస్తామని అజయ్‌జైన్‌, జయప్రకాష్‌రావు వెల్లడించారు. అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే విద్యార్థులకు మలివిడత కౌన్సెలింగ్‌లో అవకాశాన్ని కల్పిస్తామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని చెప్పారు. ఏటా అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల వెల్లడి ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తుండటంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. తొలుత మార్కులను ప్రకటించి, ఈ పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాక ర్యాంకులను ప్రకటిస్తున్నారు. ఈ పరీక్షల ద్వారా ఎంసెట్‌ ర్యాంకులు సాధించే వారు తక్కువగా ఉంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈదఫా ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాల ఆధారంగానే అధికారులు ర్యాంకులను ప్రకటించబోతున్నారు.

7, ఫిబ్రవరి 2013, గురువారం

'ఆధార్'కు అర్జంటేమీ లేదు...

మెదక్  జిల్లాలో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్‌కు, ఆధార్ కార్డులకు లింకు లేదని జిల్లా కలెక్టర్ దినకర్‌బాబు జోగిపేటలో చెప్పారు.  జోగిపేటలో ని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్రంలో  కేవలం జంటనగరాల్లో మాత్రమే గ్యాస్‌కు ఆధార్ కార్డుకు, లింకు పెట్టారని, మెదక్ జిల్లాలో అలాంటిదేమీ లేదన్నారు.

భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు కలిగి ఉండడం తప్పనిసరైనా, ప్రస్తుతానికి జిల్లా వాసులకు అలాంటి తొందర ఏమీలేదన్నారు. ఒకవేళ సమీప భవిష్యత్తులో ప్రభుత్వం రాష్ట్రమంతా ఆధార్ కార్డునుతప్పనిసరి చేస్తే ప్రత్యేకంగా అధిక సెంటర్లు ఏర్పాటు చేసి అందరికీ కార్డులిప్పిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

6, ఫిబ్రవరి 2013, బుధవారం

టేక్మాల్ లోని కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు అస్వస్థత


టేక్మాల్ మండలం కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో పది మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరం, వాంతులు, తలనొప్పితో బాధపడుతున్న బాలికలను పాఠశాల సిబ్బంది  టేక్మాల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిం చారు. అనంతరం జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.పాఠశాల పరిసరాల్లో అపరిశుభ్రత నెలకొంది. పాఠశాల పక్కనుంచే మురుగునీరు ప్రవహిస్తోంది. దీంతో ఈగలు దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. వాతావరణ కాలుష్యం కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది.

5, ఫిబ్రవరి 2013, మంగళవారం

మెదక్ జిల్లా పటాన్ చెరువు లోని బీరంగూడ లో ఆధార్ కార్డ్ ల కోసం ఉద్రిక్తత

బీరంగూడ కేంద్రంలో తోపులాట
సొమ్మసిల్లిన ఇద్దరు మహిళలు
పలువురికి గాయాలు

ఆధార్ కార్డుల కోసం ప్రజలు పడుతున్న అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వ పథకాలు పొందాలంటే ‘ఆధార్’ తప్పనిసరి చేయడంతో కేంద్రాల వద్దకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఆధార్ కేంద్రాల వద్ద సామాన్య ప్రజానీకం అష్ట కష్టాలు పడుతున్నారు. అవసరమైనన్నీ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో అవస్థలు తప్పడంలేదు. పటాన్‌చెరు మండలం బీరంగూడలో నిర్వహిస్తున్న ఆధార్ కేంద్రం వద్ద మంగళవారం తోపులాట జరిగింది. ఇద్దరు వృద్ధ మహిళలు స్పృహ కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి.

మద్యం తాగించి చోరీకి యత్నం

 జోగిపేటలో సోమవారం రాత్రి మహిళకు మద్యం తాగించి ఆమె వద్ద నున్న బంగారం , వెండి ఆభరణాలు దొంగిలించడానికి ప్రయత్నించిన ఇద్దరిని స్థానికులు పట్టుకున్నారు. టేక్మాల్ మండలం ధన్నారం గ్రామానికి చెందిన లింగమ్మతో అల్మాయిపేట గ్రామానికి చెందిన మొగులయ్యతోపాటు మరో వ్యక్తి పట్టణంలోని మార్కెట్ గంజ్ ఎదురుగా ఉన్న కల్లు దుకాణంలో మద్యం తాగినట్టు తెలి సింది. కొద్దిసేపటి త ర్వాత పక్కనే ఉన్న ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి ఆమె వద్ద నున్న బంగారు గుండ్లు తీసుకొని వెండి కడియాలు తీయడానికి ప్రయత్నించారు. అటువైపుగా వెళుతున్న వారు గమనించి పట్టుకునేందుకు ప్రయత్నించడంతో మొగులయ్య అనే వ్యక్తి పట్టుబడగా మరో వ్యక్తి పారిపోయినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ అనీల్‌కుమార్ ఘటన స్థలం దగ్గరకు  వెళ్లి మొగులయ్యను అదుపులోకి తీసుకున్నారు. అతిగా మద్యం సేవించడంతో మహిళ అపస్మారక స్థితిలోకి చేరుకుంది. మహిళను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్సలు చేయిస్తున్నారు. 

పట్టుపడ్డ మొగులయ్య

అపస్మారక స్థితిలో ఉన్నలింగమ్మ

2, ఫిబ్రవరి 2013, శనివారం

ప్రమాదాలకు నిలయం అన్నాసాగర్ చెరువు కట్ట


అన్నాసాగర్ కట్టపైన రెండు కార్లు డీకొన్న దృశ్యం 

రెండు కార్లు ఢీ: ఏడుగురికి గాయాలు

www.jogipet.com :-రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన జోగిపేట మండల పరిధిలోని అన్నాసాగర్ చెరువుకట్టపై శనివారం ఉదయం చోటుచేసుకుంది. పెద్దశంకరంపేట నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారును ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కారుల్లో ప్రయాణిస్తున్న శ్రీకాంత్, రాజేష్, స్వాతి, అంకిత, అర్జున్‌రావు, శోభారాణి, పవన్‌లు స్వల్పంగా గాయపడ్డారు. వీరిని 108 జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ మల్లేశం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

1, ఫిబ్రవరి 2013, శుక్రవారం

శ్రీ చాముండేశ్వరి మాత 31 వ వార్షికోత్సవాలు

శ్రీ చాముండేశ్వరి దేవాలయం 
మంజీరానది ప్రాక్తీరం 


www.jogipet.com :- జిల్లా లోనే ప్రసిద్ద పుణ్యక్షేత్రం శ్రీ చాముండేశ్వరి ఆలయంలో అమ్మవారి 31 వ వార్షికోత్సవాలు ప్రారంబమయ్యాయి జోగిపేట కు 6 km ల దూరంలో చిటుకుల గ్రామ శివారులోని ఉత్తర వాహిగా ప్రవహిస్తున్నమంజీరా తల్లి ఒడిలో వెలసిన శ్రీ చాముండేశ్వరి మాతఉత్సవాలు 3 రోజులు కొనసాగుతాయి. ఇక్కడ మంజీరాకు విశిష్టత ఉంది దీనికి మంజీరా మొదటి పేరు వంజర, గరుడ గంగా కూడా దీనికి పేరున్నది వంజరుడనే రాజు గరుడ గంగరుడిని సహాయంతో గంగని భూలోకానికి తెచ్చినట్లు అందువల్లనే దీనికి వంజరయని, గరుడగంగయని పేరున్నట్లుపురాణాల్లో పేర్కొనబడింది.శ్రీ చాముండేశ్వరి మాత ప్రతిష్ట ఆనంద సంవత్సర పుష్య బహుళ సప్తమి 02-01-1983 నాడు చాల వైభవంగా ప్రతిష్టించబడింది. 

           ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు గణపతి పూజ, స్వస్తి వాచనం, అఖండ దీపారాధన కలశ స్థాపన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రమణ్య శర్మ ఆధ్వర్యంలో మేళ, వాయిద్యాలతో మంజీరా నదికి వెళ్లి గంగాదేవికి పూజలు చేశారు. అనంతరం అమ్మవారి భక్తులు నదీ స్నానాలు చేసి కుండల్లో అమ్మవారికి అభిషేకం కోసం నీటిని తెచ్చారు. మొదట ఆలయ అర్చకులు చాముండేశ్వరి దేవికి పాలు, పెరుగు, నెయ్యి. తేనె, పంచదారలతో పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంత భక్తులు నది నుంచి తీసుకువచ్చిన నీటితో చాముండేశ్వరి దేవికి, ఆలయంలో గల బ్రహ్మణిదేవి, భద్రకాళి, వైష్ణవిదేవిలకు అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారి ఉత్సవవిగ్రహానికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు.  అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.